LOADING...
PM Modi: వికసిత్ భారత్‌కు నారీశక్తి కీలకం: మోదీ 
వికసిత్ భారత్‌కు నారీశక్తి కీలకం: మోదీ

PM Modi: వికసిత్ భారత్‌కు నారీశక్తి కీలకం: మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ 2047 నాటికి వికసిత్ దేశంగా ఎదగాలంటే మహిళా శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆయన కీలకంగా మాట్లాడారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి "వికసిత్ భారత్" లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ లక్ష్యం చేరుకోవాలంటే 'మాతృశక్తి', 'నారీశక్తి' దేశ అభివృద్ధిలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాల్సిందేనని స్పష్టం చేశారు.Embed

వివరాలు 

33% మహిళా ప్రాతినిధ్యం లక్ష్యం

2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. చాలా పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయని, ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొన్నట్లు వివరించారు. ఈ విషయాలపై తాను ఇటీవల పత్రికలో వ్యాసం రాసి తన ఆలోచనలను పంచుకున్నానని, ప్రజలు ఆ వ్యాసాన్ని చదవాలని అలాగే ఇతరులకు కూడా చేరవేయాలని కోరారు.

వివరాలు 

పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి పిలుపు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలను ప్రోత్సహించాలని ప్రజలను ప్రధాని కోరారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఈ బిల్లును ఆమోదించి, దేశం మొత్తం కలిసి ఈ విజయాన్ని జరుపుకుందామని పిలుపునిచ్చారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారీశక్తితోనే వికసిత్ భారత్ సాధ్యం: ప్రధాని 

Advertisement