NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ
    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Dec 30, 2022
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.

    అనంతరం దీన్ని జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలు హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య నడవనుంది.

    వాస్తవానికి శుక్రవారం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించడానికి ప్రధాని కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. రైలు ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారుల అప్పటికే పూర్తి చేశారు. అయితే తెల్లవారుజామున తన తల్లి మరణించడంతో ఉదయం నేరుగా అహ్మదాబాద్ చేరుకుని.. అంత్యక్రియలకు హాజరయ్యారు మోదీ.

    మోదీ

    వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలు ప్రత్యేకతలు

    ఇది పశ్చిమ బెంగాల్‌లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలు కాగా.. దేశంలో ఏడోది

    మిగతా రైళ్లతో పోలిస్తే.. ఇందులో ప్రయాణిస్తే.. మూడు గంటలు ఆదా అవుతుంది

    7.45 నిమిషాల్లో 564కిలో మీటర్లు ప్రయాణిస్తుంది

    ఈ ట్రైన్‌లో 16కోచ్ ఉంటాయి.. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు

    ఈశాన్య రాష్ట్రాల ప్రయాణికులకు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలు చాలా అనువుగా ఉంటుంది. అందుకే దీన్ని ఈశాన్యానికి గేట్ వేగా చెబుతున్నారు

    ఈ రైలు ఉదయం 6 గంటలకు హౌరా స్టేషన్‌నుంచి బయలుదేరి న్యూ జల్‌పాయిగుఢి స్టేషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ ఒక గంట ఆగి.. తిరిగి బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకు మళ్లీ హౌరా చేరుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    పశ్చిమ బెంగాల్

    తాజా

    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా
    Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్ కుబేర

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025