PM Modi-Trump: మలేషియాలో ట్రంప్-మోదీల మధ్య భేటీ లేనట్లే..?
ఈ వార్తాకథనం ఏంటి
మలేషియాలోని రాజధాని కౌలాలంపూర్లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరుగనుంది. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ కూడా జరగదు. సదస్సులో పాల్గొనలేకపోవడానికి మోదీ షెడ్యూల్ సమస్యలను కారణంగా పేర్కొన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. మోదీకి స్థానంలో భారత విదేశాంగ మంత్రి స్. జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారని సమాచారం. ఈ శిఖరాగ్ర సమావేశంలో మోదీ వర్చువల్గా పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు.
వివరాలు
కంబోడియా పర్యటన కూడా వాయిదా
ఈ సదస్సు నేపథ్యంలో మలేసియాతో పాటు కంబోడియాలో కూడా పర్యటించాలని తొలుత మోదీ భావించినట్లు తెలిపారు అయితే, మోదీ సదస్సుకు వెళ్లకపోవడం వల్ల కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఈ సదస్సులో ట్రంప్ సహా అనేక ఇతర దేశాల నాయకులు హాజరుకానున్నారు. ఈ ఆసియాన్ సమాఖ్యలో మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో భారత్-ఆసియాన్ సంబంధాలు గణనీయంగా పెరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ రంగాల్లో సహకారం ప్రధానంగా పెరిగింది.