LOADING...
PM Modi: ముగిసిన ప్రధాని భూటాన్‌ పర్యటన.. ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

PM Modi: ముగిసిన ప్రధాని భూటాన్‌ పర్యటన.. ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూటాన్‌ పర్యటన ముగించుకుని దేశ రాజధానికి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు. ఆయన లోక్‌నాయక్‌ ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద విచారించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 6.50 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో నెమ్మదిగా కదులుతున్న తెలుపు రంగు హ్యుందాయ్‌ i20 కారులో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి.

వివరాలు 

ముగ్గురు వైద్యులను అరెస్ట్

ఈ ఘటనకు కొన్ని గంటల ముందే భద్రతా బలగాలు పెద్ద ఉగ్రవాద ముఠాను బట్టబయలు చేశాయి. జైష్‌-ఇ-మొహమ్మద్‌, అంసార్‌ ఘజ్వత్‌-ఉల్‌-హింద్‌ సంస్థలతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని, అందులో ముగ్గురు వైద్యులను అరెస్ట్‌ చేశారు. వారివద్ద నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్వర్క్‌ కాశ్మీర్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ముజమ్మిల్‌ గనాయి, డాక్టర్‌ షాహీన్‌ సయీద్‌ ఉన్నారు. ఆ యూనివర్సిటీలోని గిడ్డంగి నుంచి 360 కిలోల అమోనియం నైట్రేట్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకీ 45 కి.మీ దూరంలో ఉన్న ఈ యూనివర్సిటీ యూజీసీ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థ.

వివరాలు 

గనాయి,ఉమర్‌ ఇద్దరూ ముందుగా ఎర్రకోట పరిసరాల్లో రికీ

ఎర్రకోట వద్ద పేలిన కారును నడిపింది కూడా ఆ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఉమర్‌ నబీ అని పోలీసులు తెలిపారు. పేలుడులో ఆయన మరణించినట్టు అనుమానిస్తున్నారు. గనాయి,ఉమర్‌ ఇద్దరూ ముందుగా ఎర్రకోట పరిసరాల్లో రికీ చేసినట్టు సమాచారం. దీపావళి సందర్భంగా జనసమ్మర్థ ప్రాంతంలో దాడి చేయాలని యోచించారని, కానీ అది సఫలీకృతం కాలేదని పోలీసులు తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో దాడి చేయాలనే పన్నాగం కూడా వేసినట్టు చెప్పారు.

వివరాలు 

డిటోనేటర్‌ ద్వారా మాన్యువల్‌గా పేల్చినట్టు అనుమానం

అధికారుల ప్రకారం, పేలుడు కారులో అమోనియం నైట్రేట్‌-ఫ్యూయల్‌ ఆయిల్‌ మిశ్రమంతో (ANFO) తయారుచేసిన బాంబుతో జరిగింది. డిటోనేటర్‌ ద్వారా మాన్యువల్‌గా పేల్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని సూచనలు ఉన్నాయి. సేకరించిన పేలుడు పదార్థ నమూనాల్లో కొన్ని అధిక శక్తి గలవి కావడంతో విచారణ బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ