NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
    PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ

    PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2024
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

    ఉద్యోగాల నుంచి మొదలుకొని అన్ని రకాల రిజర్వేషన్లకు దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని మోదీ విమర్శించారు.

    నేటి కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారన్నారు.

    బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఈ కాంగ్రెస్ దేశంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ఉండేది కాదన్నారు.

    ప్రధానిగా ఉన్నప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖను ఈ సందర్భంగా మోదీ రాజ్యసభలో ప్రస్తావించారు.

    మోదీ

    ప్రజలకు రిజర్వేషన్‌ను దూరం చేసిన కాంగ్రెస్‌ 

    గత ఏడు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలకు ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను కాంగ్రెస్ దూరం చేసిందని మోదీ మండిపడ్డారు.

    జమ్ముకశ్మీర్‌లో దశాబ్దాలుగా అనేక మంది నివసించినా.. కాంగ్రెస్ వారికి నివాస హక్కు కల్పించలేదన్నారు.

    జమ్మూకశ్మీర్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను నిన్ననే సభ ఆమోదించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదన్నారు.

    బాబా సాహెబ్ లేకపోతే ఈ కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చేది కాదని స్పష్టం చేశారు. బాబా సాహెబ్‌కు భారతరత్న ఇవ్వడానికి వారు నిరాకరించారన్నారు.

    బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బాబా సాహెబ్‌కు భారతరత్న ప్రకటించామన్నారు. అంతేకాదు అత్యంత వెనుకబడిన కులానికి చెందిన సీతారాం కేసరిని కాంగ్రెస్ రోడ్డున పడేసిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    రాజ్యసభ
    కాంగ్రెస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ  అయోధ్య
    PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం భారతదేశం
    PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి  భారతదేశం
    Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ  బిహార్

    రాజ్యసభ

    ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు లోక్‌సభ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు ఎంపీ

    కాంగ్రెస్

    Rahul Gandhi: పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన‌కు నిరుద్యోగమే కారణం: రాహుల్‌ గాంధీ  రాహుల్ గాంధీ
    Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు  తన్నీరు హరీష్ రావు
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  ఛత్తీస్‌గఢ్‌
    PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేయాలి.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025