LOADING...
PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు
తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు

PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తమిళనాడులో పొంగల్ పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు ఆయన తమిళనాడులో పర్యటించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ పర్యటనలో రైతులతో కలిసి పొంగల్ వేడుకలు జరుపుకునే కార్యక్రమం కూడా ఉండనుందని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా, సాంస్కృతిక ఏకీకరణను బలోపేతం చేసే సంకేతంగా బీజేపీ వర్గాలు చూస్తున్నాయి. పంటల పండుగగా పేరొందిన 'పొంగల్'ను తమిళనాడులో ప్రధాని మోదీ జరుపుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Details

తమిళనాడులో బలపడటానికి దృష్టి

దీని ద్వారా గ్రామీణ తమిళనాడుతో బీజేపీ సంబంధాలను మరింత బలపరచడం, అలాగే తమిళ సంస్కృతి, గుర్తింపుపై తమ ప్రాధాన్యతను స్పష్టం చేయడం మోదీ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం తమిళనాడు-కాశీ మధ్య నాగరికత, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించనున్న 'కాశీ తమిళ సంగమం 4.0' ముగింపు వేడుకల్లో పాల్గొనడానికి ప్రధాని రామేశ్వరానికి వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో పుదుక్కోటలో జరగనున్న రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమం 'తమిళగం తలై నిమిర తమిళనిన్ పయనం' ముగింపు సభలో కూడా మోదీ పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.

Details

పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరే అవకాశం

ఎన్నికలకు ముందే జరిగే ఈ పర్యటనతో తమిళనాడులో ఎన్డీయే ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉందని, అలాగే పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలు, సమన్వయం, కార్యచరణను ఖరారు చేయడానికి మోదీ ఎన్డీయే నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశమూ ఉంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్డీయేను మరింత బలపరచే దిశగా పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే), దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)తో పాటు, బహిష్కృత ఏఐఏడీఎంకే నేత ఓ. పన్నీర్‌సెల్వం సహా పలు పార్టీలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Advertisement

Details

వీకే శశికళతో చర్చలు

ప్రధాని పర్యటనకు ముందే ఈ పొత్తు చర్చలను ముగించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళతో కూడా ఎన్డీయే చర్చలు జరుపుతోందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారి తీసే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement