NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 
    తదుపరి వార్తా కథనం
    Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 
    ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు

    Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12 నుండి రెండు రోజుల పాటు అమెరిలో పర్యటించనున్నారు.

    అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫిబ్రవరి 13న భేటీ కానున్నారు.

    ఈ సమాచారాన్ని అధికారిక వర్గాలు మీడియాకు సూచనప్రాయంగా వెల్లడించాయి.

    ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత,ప్రధాని మోదీ తొలిసారి ఆయనను కలుసుకోనున్నారు.

    2024 నవంబర్‌లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ట్రంప్ 2025,జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

    ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల్లో, ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్న కొద్దిమంది విదేశీ నాయకుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.

    అయితే, ప్రధాని మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

    వివరాలు 

    అమెరికా నుంచి పౌర అణు సహకారం

    విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ)ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వాషింగ్టన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది.

    వలసలపై, సుంకాలపై అమెరికా అధ్యక్షుని అభిప్రాయాలపై భారతదేశంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో,ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

    ట్రంప్, కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25శాతం సుంకాన్ని,చైనా వస్తువులపై అదనంగా 10శాతం సుంకాన్ని ఇటీవల ప్రకటించారు.

    జనవరి 27న, ప్రధానమంత్రి మోదీ, ట్రంప్‌ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్యం,ఇంధనం,రక్షణ రంగాలలో భారతదేశం-అమెరికాలు భాగస్వామ్యంతో పనిచేయాలనే అభిలాషను వ్యక్తం చేశారు.

    ప్రధాని మోదీ,అమెరికా పర్యటనకు ముందు,భారత్‌ అణు బాధ్యత చట్టాన్ని సవరించడానికి,అణుశక్తి మిషన్‌ను ఏర్పాటు చేయడానికి తన ప్రణాళికలను ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో,అమెరికా నుంచి పౌర అణు సహకారం అందుకునేందుకు భారత్‌ ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్

    నరేంద్ర మోదీ

     PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు రవిచంద్రన్ అశ్విన్
    Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం కువైట్
    Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ  భారతదేశం
    PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!  భారతదేశం

    డొనాల్డ్ ట్రంప్

    Justin Trudeau: మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్.. స్పందించిన ట్రూడో జస్టిన్ ట్రూడో
    Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్‌ హెచ్చరిక అమెరికా
    #NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే? అమెరికా
    Claudia Sheinbaum: "మేము USని 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు" : ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక మెక్సికో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025