NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ
    PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు.. మాదిగల పోరాటానికి నా మద్దతు: ప్రధాని మోదీ

    PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Nov 11, 2023
    07:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

    సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

    బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తొలుత మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.

    సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి నరసింహుడికి నమస్కారం అంటూ ప్రంసంగాన్ని మొదలు పెట్టారు. దేశంలో బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా ఉన్నట్లు మోదీ ఉద్ఘాటించారు.

    ఈ సందర్భంగా విశ్వరూప మహాసభకు వచ్చిన తన బంధువులకు అభినందనలు అంటూ పేర్కొన్నారు.

    మోదీ

    అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయి: మోదీ

    స్వాతంత్ర్య భారతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయని, కానీ బీజేపీ మాత్రమే సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు.

    తెలంగాణలోని అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికే తాను వచ్చినట్లు చెప్పారు.

    మందకృష్ణ మాదిక గత 30 ఏళ్లుగా ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యమిస్తున్నారన్నారు.

    మందకృష్ణ పోరాటానికి మేము కచ్చితంగా అండగా ఉంటామని స్పష్టం చేసారు. అంతేకాదు, మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు.

    మాదిగ హక్కులను సాధించే వరకు మందకృష్ణ మాదిగకు అండగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు.

    మోదీ

    దళితబంధు అనేది బీఆర్‌ఎస్‌ నేతల బంధువులకే: మోదీ

    తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా ఇక్కడి మాదిగల్ని మోసం చేస్తోందన్నారు. దళితులను సీఎం చేస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారన్నారు.

    2014లో తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం.. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనట్లు వివరించారు.

    దళతబంధుపై కూడా మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితబంధు అనేది బీఆర్‌ఎస్‌ నేతల బంధువుల పథకంగా మారినట్లు చెప్పారు.

    కేవలం బీఆర్ఎస్ నేతలకు ఇచ్చి, చేతులు దులుపుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారు. అంతేకాదు, కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదన్నారు.

    దళితులకు మూడెకరాలు, రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు గుర్తుచేసారు. కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్‌ పేరుతో కుంభకోణం చేసిందన్నారు.

    మోదీ

    అంబేద్కర్‌ విధానాలకు కాంగ్రెస్‌ తూట్లు: మోదీ

    అంబేద్కర్‌ విధానాలకు కాంగ్రెస్‌ తూట్లు పొడిచినట్లు మోదీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పట్ల దలితులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

    దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా తాము నిలబెడితే, కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేసిందన్నారు. అంతేకాదు, ఆదివాసీ అయిన ముర్ము కూడా కాంగ్రెస్ ఓడించాలని అనుకున్నట్లు పేర్కొన్నారు.

    అంబేద్కర్‌‌కు భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీతే అన్నారు. కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు.

    అంతేకాకుండా, అంబేద్కర్‌ను ఎన్నికల్లో గెలవకుండా చేసింది కాంగ్రెస్ చేసిందన్నారు. అణగారిన వర్గాలకు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర

    Congress and the BRS are alike in corruption...

    BRS govt allied with Delhi's AAP govt in corruption. They are involved in the Liquor Scam. They cooperate not in work but in corruption.

    - PM @narendramodi #BJPWithMadigas pic.twitter.com/qqbQr1hFIF

    — BJP (@BJP4India) November 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    హైదరాబాద్
    సికింద్రాబాద్
    తెలంగాణ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ  ఎన్నికల ప్రచారం షురూ   తెలంగాణ
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు మధ్యప్రదేశ్
    భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు మధ్యప్రదేశ్

    హైదరాబాద్

    Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్‌ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు  ముషీరాబాద్
    Jabardasth Artist: యువతిని శారీరకంగా వాడుకున్నాడని.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు పోలీస్
    హైదరాబాద్‎లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌  మేనేజర్ మృతి  హత్య

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తెలంగాణ

    నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్ నర్సాపూర్
    Kuna Sriasailam Goud : కూన శ్రీశైలం మీద వివేకానంద దాడి.. పోలీసులకు ఫిర్యాదు  బీఆర్ఎస్
    బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి బీఆర్ఎస్
    BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025