
PM Modi: నేవీ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు… 2014 నుండి ఎక్కడ ఎక్కడ జరిగాయో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా, స్వదేశీ నినాదం వినిపిస్తూ ఈ ఉత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రధాని మోదీ ఈసారి దీపావళి వేడుకలను గోవా తీరంలో నేవీ సిబ్బందితో కలిసి జరుపుతున్నారు. దీనికి ముందు, పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ గట్టి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కూడా INS విక్రాంత్ యుద్ధనౌకపై "మెన్ ఇన్ వైట్"తో కలిసి గుర్తు చేసుకున్నారు. 2014 లో ప్రధాని పదవికి చేప్పటినప్పటి నుంచి, ప్రతీ దీపావళి వేడుకను సాయుధ దళాలతో జరుపుకోవడం మోదీకి ఒక సంప్రదాయంగా మారింది.
వివరాలు
ప్రతి దీపావళి ప్రత్యేకంగా..
2014: లడఖ్లోని సియాచిన్ హిమానీనదంలో భద్రతాదళాలతో కలిసి దీపాల పండుగ జరుపుకున్నారు. 2015: 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరులను సత్కరించడానికి పంజాబ్లోని అమృత్సర్లో డోగ్రాయ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. 2016: హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో వద్ద, భారత్-చైనా సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ సిబ్బందితో వేడుకలు జరుపుకున్నారు. 2017: జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో సైనికులతో కలిసారు.
వివరాలు
చారిత్రక యుద్ధ ప్రదేశాలలో
2018: ఉత్తరాఖండ్లోని హర్సిల్లో, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు. 2019: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో సైనికులను కలిశారు. 2020: కోవిడ్-19 మహమ్మారి సమయంలో, రాజస్థాన్లోని జైసల్మేర్ లాంగేవాలా వద్ద, 1971 యుద్ధ ప్రదేశంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్గిల్ నుండి గోవా వరకు 2021: జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా వద్ద సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2022: కార్గిల్లో సైనికులతో దీపావళి ఉత్సవాలు నిర్వహించారు. గత రెండు సంవత్సరాలు.. హిమాచల్ ప్రదేశ్లోని లెప్చా, గుజరాత్లోని సర్ క్రీక్లో సైనికులతో కలిసారు. ఈ ఏడాది గోవా తీరంలో నేవీ సిబ్బందితో దీపావళి జరుపుకోవాలనే ప్రధాని మోదీ నిర్ణయం దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ప్రతి దళానికి తన మద్దతును తెలియజేస్తుంది.