NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 
    PM Modi కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

    PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2024
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అసోం చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఇక్కడ ఏనుగు (Elephant Safari)పై ప్రయాణించారు.

    కజిరంగా పార్క్‌(Kaziranga National Park) సెంట్రల్ కోహోరా రేంజ్ సమీపంలోని పోలీసు అతిథి గృహంలో ప్రధాని శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం తెల్లవారుజామున పార్కుకు వచ్చారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏనుగు, జీపు రెండింటిలోనూ ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.

    కొంతసేపు ఏనుగుపై స్వారీ చేసిన తర్వాత ప్రధాని జీపుపై అడవిలోకి వెళ్లారు.

    దాదాపు రెండు గంటల పాటు ప్రధాని ఇక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ ఏనుగు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    నరేంద్ర మోదీ

    తొలిసారి ప్రధాని మోదీ సందర్శన

    ఖడ్గమృగాలకు అతిపెద్ద నివాస స్థలంగా కజిరంగా నేషనల్ పార్క్‌ ప్రసిద్ధి చెందింది. ఈ ఉద్యానవనం 600రకాల పక్షులకు నిలయం.

    ఈ పార్క్‌ను 1985లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించింది.

    ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్‌‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    కజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన హాలిడే గమ్యస్థానా ఒకటి.

    2200 కంటే ఎక్కువ భారతీయ ఒక-కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో 2/3 వంతు ఈ పార్కులో ఉన్నాయి.

    ఇది తూర్పు హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ - గోలాఘాట్, నాగావ్ జిల్లా అంచులలో ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కజిరంగా నేషనల్ పార్క్‌లో మోదీ

    #WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp

    — ANI (@ANI) March 9, 2024

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ ట్వీట్

    This morning I was at the Kaziranga National Park in Assam. Nestled amidst lush greenery, this UNESCO World Heritage site is blessed with diverse flora and fauna including the majestic one horned rhinoceros. pic.twitter.com/68NEtoGAoz

    — Narendra Modi (@narendramodi) March 9, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అస్సాం/అసోం
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ  ఖతార్
    PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ
    Muft Bijli: 'ముఫ్ట్ బిజ్లీ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  భారతదేశం
    PM In UAE: నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ

    అస్సాం/అసోం

    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత హిమంత బిస్వా శర్మ

    తాజా వార్తలు

    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత  బెంగళూరు
    Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు  చిరుతపులి
    Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025