NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్
    తదుపరి వార్తా కథనం
    Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్
    'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్

    Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంపై వచ్చిన ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పందనను తెలిపారు.

    ఆ ఆరోపణలు తప్పుడు సమాచారం అంటూ, అవి కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఖండించారు.

    సీఎం స్థాయిలో ఉంటూ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని, భక్తుల మనోభావాలను అనవసరంగా దెబ్బతీసే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు.

    మీడియాతో మాట్లాడిన జగన్, వంద రోజుల తరువాత తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎలా బయటకొచ్చిందని ప్రశ్నించారు.

    ఆయన చెప్పిన ప్రకారం, చంద్రబాబు హయాంలోనే ఈ కల్తీ జరిగిందని తేలింది. లడ్డూ తయారీ పద్ధతులు దశాబ్దాలుగా ఒకే విధంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

    వివరాలు 

    చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం: జగన్ 

    జగన్, చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, 100 రోజుల పాలనలో ముఖ్యమైన పథకాలు అమలు చేయలేకపోయినందున, కొత్త వివాదాలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

    నెయ్యి కల్తీ గురించి చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని చెప్పారు. ఆయన హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించారని గుర్తు చేశారు.

    ప్రతి విషయంలోనూ డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయని పేర్కొంటూ,చంద్రబాబు హయాంలో జరిగిన పలుకారణ సంఘటనలను ప్రస్తావించారు.

    ముంబై నుంచి హీరోయిన్‌ను తెచ్చి మరో డైవర్షన్‌కు తెరలేపారని జగన్ ఆరోపించారు.

    తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతపై జరుగుతున్న ఆరోపణలను ఖండిస్తూ,జగన్, నెయ్యి ట్యాంకర్‌ను తిరుమలకు పంపించే ముందు అన్ని పరీక్షలు చేసి నెయ్యి శాంపిల్స్‌ను NABL సర్టిఫికెట్‌తో అనుమతిస్తారని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన విశాఖపట్టణం
    Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు  బండి సంజయ్
    విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025