NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు
    తదుపరి వార్తా కథనం
    త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు
    త్రిపురలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

    త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు

    వ్రాసిన వారు Stalin
    Feb 16, 2023
    07:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలకు ముసింగింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

    ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటలకు వరకు కొనసాగాల్సి ఉండంగా, పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అధికారులు సమయాన్ని మరో గంట పొడిగించారు.

    సాయంత్రం 5గంటల సమయానికి 81శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.

    శాంతిర్‌బజార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కలచెర్రా పోలింగ్ స్టేషన్ వెలుపల అధికార బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు.

    త్రిపుర సీఎం మాణిక్ సాహా, సీపీఎం నాయకుడు, మాజీ సీఎం మాణిక్ సర్కార్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    త్రిపుర

    ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం

    60స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 259మంది అభ్యర్థులు పోటీచేశారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

    ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఎం అధికార బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల కోసం జట్టు కట్టాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి పోటీ చేసింది. రాజ వంశీయుడు ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మచే ప్రారంభించిన టిప్రా మోతా పార్టీ కూడా ఈఎన్నికల్లో పోటీ చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది.

    బీజేపీ 55స్థానాల్లో, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ ఆరు స్థానాల్లో పోటీ చేశాయి. ఆంపినగర్ నియోజకవర్గంలో మిత్రపక్షాలైన బీజేపీ, ఐపీఎఫ్‌టీ తమ అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం.

    వామపక్షాలు 47, కాంగ్రెస్ 13స్థానాల్లో బరిలో నిలిచాయి.

    మార్చి 2న ఓట్లను లెక్కించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025