NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలు: త్రిపురలో ముగిసిన ప్రచారం పర్వం, గురువారం పోలింగ్
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపురలో ముగిసిన ప్రచారం పర్వం, గురువారం పోలింగ్
    త్రిపురలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపురలో ముగిసిన ప్రచారం పర్వం, గురువారం పోలింగ్

    వ్రాసిన వారు Stalin
    Feb 14, 2023
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రిపురలో నెల రోజులుగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. 8 జిల్లాల్లోని మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, త్రిపుర స్టేట్ రైఫిల్స్, రాష్ట్ర పోలీసు సిబ్బందితో భారీ భద్రత నడుమ పోలింగ్ జరగనుంది.

    3,327 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 31,000 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో 31మంది మహిళలు సహా మొత్తం 259 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు తెలిపారు.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది మహిళలు సహా 297 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో మొదటిసారిగా కాంగ్రెస్-సీపీఎం జట్టు

    పోలింగ్ రోజన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర సాయుధ బలగాలు(సీఏపీఎఫ్) 400 కంపెనీలను తరలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 9వేల మంది త్రిపుర స్టేట్ రైఫిల్స్, 6మందికి పైగా త్రిపుర పోలీసులను కూడా మోహరించినట్లు వెల్లడించారు.

    త్రిపురలో మొదటిసారిగా కాంగ్రెస్-సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మొదటిసారిగా కూటమిగా ఎన్నిక బరిలోకి దిగుతున్నాయి. లెఫ్ట్‌ఫ్రంట్ 47 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్‌కు 13 సీట్లు కేటాయించింది.

    అధికార బీజేపీ మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇచ్చి 55 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతోంది.

    ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున హేమాహేమీలు ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ, ఉత్తర మరియు పశ్చిమ త్రిపురలో మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025