NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం
    తదుపరి వార్తా కథనం
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం
    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం

    కమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం

    వ్రాసిన వారు Stalin
    Feb 13, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 35ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ చరిత్ర సృష్టించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    1978 నుంచి 35 ఏళ్ల పాటు వామపక్షాలు త్రిపురను పాలించినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు హత్యలు, హింసకు పాల్పడ్డారని, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వబోమని చెప్పారు.

    సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమం కోసం బీజేపీ పని చేస్తుందని మాణిక్ సాహా పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయని చెప్పారు.

    త్రిపుర

    36 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాం: మాణిక్ సాహా

    కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే ప్రచారానికి ఆ పార్టీ నాయకులు రావట్లేదని మాణిక్ సాహా పేర్కొన్నారు. బీజేపీ ఒక కుటుంబమని ఎన్నికల సమయంలో అందరు నాయకులు వచ్చి ప్రచారం చేస్తారని చెప్పారు.

    అధికారం కోసం రాజకీయాలు చేయటం లేదని, సామాజిక మార్పు కోసమే పనిచేయాలని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని మాణిక్ పేర్కొన్నారు. మోదీ మాటలను నిజం చేస్తూ సమాజంలోని చివరి మనిషి కోసం పనిచేస్తున్నామని వివరించారు.

    అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నా, రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సారి 36కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర
    ముఖ్యమంత్రి
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు

    ముఖ్యమంత్రి

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025