NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన మోదీ

    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Feb 13, 2023
    02:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.

    రక్షణ ఉత్పత్తి దేశాల సరసన చేరడానికి భారతదేశం ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    'ఏరో ఇండియా 2023' ఈవెంట్ భారత్ కొత్త ఆలోచనను ప్రతిబింబిస్తుందన్నారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, భారతదేశం బలం అన్నారు.

    నేడు భారత్ ప్రపంచ రక్షణ కంపెనీలకు మార్కెట్ మాత్రమే కాదని, భాగస్వామి అని మోదీ ప్రకటించారు.

    ప్రధాని మోదీ

    భారత సాంకేతికత తక్కువ ఖర్చుతో కూడుకున్నది: మోదీ

    21వ శతాబ్దపు భారతదేశం ఏ అవకాశాన్ని కోల్పోదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దాని కలలను సాధించేందుకు కష్టపడి పనిచేయడానికి వెనుకాడబోదని స్పష్టం చేశారు.

    తమ సాంకేతికత తక్కువ ఖర్చుతో కూడుకున్నది మోదీ చెప్పారు. అలాగే నిజాయితీతో కూడుకున్నది, విశ్వసనీయమైనదని వివరించారు.

    తేజస్‌ యుద్ధ విమానాలు, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌తో పాటు తుమకూరులోని హెలికాప్టర్‌ ఫ్యాక్టరీ 'మేక్‌ ఇన్‌ ఇండియా' శక్తికి నిదర్శనమని మోదీ అన్నారు.

    'ఈజ్ ఆఫ్ డూయింగ్-బిజినెస్' కోసం భారత్ చేసిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

    ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దేశీయ ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి భారత్ అనేక చర్యలు తీసుకుందని మోదీ చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    21వ శతాబ్దపు భారతదేశం ఏ అవకాశాన్ని కోల్పోదు: ప్రధాని మోదీ

    New India of 21st century will now neither lose any opportunity nor lag behind in hard work.We're ready.On the path to reforms,we're bringing revolution in every sector.The country which was the biggest defence importer for decades now exports defence equipment to 75 countries:PM pic.twitter.com/GIiJuOqrPM

    — ANI (@ANI) February 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బెంగళూరు
    ప్రధాన మంత్రి
    కర్ణాటక

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    నరేంద్ర మోదీ

    భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు ప్రధాన మంత్రి
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ ప్రధాన మంత్రి
    భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని పాకిస్థాన్

    బెంగళూరు

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ కర్ణాటక

    ప్రధాన మంత్రి

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025