NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్
    త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్

    వ్రాసిన వారు Stalin
    Jan 18, 2023
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఈసీ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 9,125 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

    త్రిపురలో జనవరి 21న, మేఘాలయ, నాగాలండ్‌లో జనవరి 31న నోటిఫికేషన్ వస్తుంది.

    త్రిపురలో జనవరి 30లోపు, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 7లోపు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

    త్రిపురలో జనవరి 31న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 8న నామినేషన్ల పరిశీలన

    త్రిపురలో ఫిబ్రవరి 2న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 10న నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఈసీ సూచించింది.

    అసెంబ్లీ ఎన్నికలు

    మూడు రాష్ట్రాల్లో 60చొప్పున అసెంబ్లీ స్థానాలు

    త్రిపుర: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది.

    మేఘాలయ: 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 60మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. కేవలం 2సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    2023ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎన్‌పీపీ అధినేత సంగ్మా ఇప్పటికే ప్రకటించారు.

    నాగాలాండ్:2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసెంబ్లీ ఎన్నికలు
    త్రిపుర

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025