NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల
    తదుపరి వార్తా కథనం
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల
    నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల

    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల

    వ్రాసిన వారు Stalin
    Jan 18, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఈసీ షెడ్యూల్‌ను వెల్లడించనుంది.

    నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలో ప్రస్తుత శాసన సభల పదవీకాలం మార్చి నెలతో ముగియనుంది. ఇటీవలే ఎన్నికల సంఘం ప్రతినిధులు ఈ రాష్ట్రాల్లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. స్థానిక రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్నారు.

    ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో ఈసీ ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

    ఈసీ

    ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా?

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది.

    2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. దీంతో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40 నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా
    Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు  సుప్రీంకోర్టు

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025