NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yadadri: యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు
    తదుపరి వార్తా కథనం
    Yadadri: యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు
    యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి

    Yadadri: యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    02:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ఏర్పాట్లు చేస్తోంది.

    దేశంలోనే అత్యంత పెద్ద థర్మల్ కేంద్రం, యాదాద్రి, 5 యూనిట్లతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతోంది.ఒక్కో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు.

    ప్రస్తుతం,రెండో యూనిట్‌లో వారంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఈ ప్రక్రియలో, 3-4 రోజుల్లో బాయిలర్ లైటప్ కార్యక్రమం చేపడతారు. మొదట హై ఫర్నేస్డ్ ఆయిల్‌తో విద్యుత్ ఉత్పత్తి చేపడతారు.

    ఇది నిర్మాణంలో లోపాలు లేదా లీకేజీలున్నాయో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

    కొన్ని రోజుల తనిఖీ తర్వాత,బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ తరువాత, పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి, రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేయబడుతుంది.

    వివరాలు 

    భెల్‌కు జెన్‌కో గడువు

    అక్టోబరులో ఒక యూనిట్‌లో పూర్తిస్థాయిలో,మరొక యూనిట్‌లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టింది.

    2025 మార్చి నాటికి, 5యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించి, 4,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలని నిర్మాణ సంస్థ భెల్‌కు జెన్‌కో గడువు పెట్టింది.

    అయితే,ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే మూడు సంవత్సరాలకు పైగా జాప్యం జరిగింది. మరింత ఆలస్యం జరిగితే, జెన్‌కోకు మరింత నష్టం వాటిల్లే ఆందోళన ఉంది.

    వివరాలు 

    సిబ్బంది నియామకం.. 

    భద్రాద్రి,యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ సిబ్బంది నియామకానికి సంబంధించిన కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ రెండు కేంద్రాల నిర్మాణానికి గడిచిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, కానీ నిర్మాణం ఆలస్యమైనందున సిబ్బంది నియామకాలు పూర్తవ్వలేదు.

    యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానున్న నేపథ్యంలో,అవసరమైన సిబ్బంది సంఖ్యను నిర్ధారించేందుకు 8 మంది ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు.

    ఈ కమిటీలో జెన్‌కో, ట్రాన్స్‌కోకి చెందిన ఐదుగురు డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీరు, చీఫ్ జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉన్నారు. వారికీ వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

    వివరాలు 

    విద్యుత్ ఉద్యోగులకు సాధారణ బదిలీలు

    అదే సమయంలో, ట్రాన్స్‌కో, జెన్‌కోలో 200 మందికి పదోన్నతులు ఇచ్చారు. వీటిని అసిస్టెంట్ ఇంజినీరు నుండి చీఫ్ ఇంజినీరు వరకు వరసగా విభజించారు.

    ఈ పదోన్నతుల వల్ల, కింది స్థాయిలో పోస్టుల నియామకాల కోసం త్వరలో నేరుగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.

    అలాగే, విద్యుత్ ఉద్యోగులకు సాధారణ బదిలీలు కూడా త్వరలో జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాదాద్రి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    యాదాద్రి

    తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు తెలంగాణ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే! భారతదేశం
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025