LOADING...
Draupadi Murmu:శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము
శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

Draupadi Murmu:శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

శీతాకాల విరామాన్ని హైదరాబాద్‌లో గడపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు. హకీంపేటలో ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ఆమె ప్రత్యేక విమానంలో రాగా, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 18న ఆమె అధికారిక నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. 19వ తేదీన రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 20న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. 21న నివాసంలో ఏర్పాటు చేసే పౌరుల భేటీతో పాటు'ఎట్‌ హోమ్‌'కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 22వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

Advertisement