PM Modi: నీట్ పేపర్ లీక్ మహా పాపం.. మొదటిసారి స్పందించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది క్షమించరాని మహా పాపం అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైన 'మంగళ్ మిలన్' కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ, నీట్ పేపర్ లీక్ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఈ కేసులో బాధ్యులైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ఆయన తేల్చిచెప్పారు.
వివరాలు
13 మంది కీలక నిందితుల అరెస్టు
లీకేజీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించే దిశగా దర్యాప్తు సంస్థలు వేగంగా పనిచేస్తున్నాయని ప్రధాని వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 మంది కీలక నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
పేపర్ లీక్కు గురైన అదే నీట్ పరీక్షలను తిరిగి విజయవంతంగా నిర్వహించి, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు.