NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
    భారతదేశం

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 25, 2023, 05:43 pm 1 నిమి చదవండి
    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
    మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు

    జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్య రంగంలో వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద, రాజకీయ, భద్రత, ఆర్థిక, శాస్త్రీయ రంగాలలో సమగ్ర సహకారం కోసం దీర్ఘకాలిక ఫ్రేమ్‌వర్క్‌పై దృష్టి సారించనున్నట్లు మోదీ పేర్కొన్నారు. భారతదేశం, ఈజిప్టుల రక్షణ పరిశ్రమల మధ్య సహకారంపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.

    ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు

    ఐటీ, సైబర్‌సెక్యూరిటీ, కల్చర్‌, యూత్‌ మేటర్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌లో సహకారం వంటి ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వాముల స్థాయికి తీసుకువెళతామని ఇరుదేశాల అధినేతలు ఆశించాయి. తీవ్రవాద నిరోధం, రక్షణ విషయంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి ఈజిప్టు ఆసక్తిగా ఉందని అబ్దెల్ ఫతాహ్ చెప్పారు. పర్యాటకాన్ని పెంచేందుకు ఇరు దేశాల మధ్య మరిన్ని విమానాలు నడపాలని సీసీ ప్రతిపాదించారు. ఉగ్రవాద దాడులపై ఈజిప్ట్-భారత్ విచారం వ్యక్తం చేశాయి. మానవాళికి ఉగ్రవాదం పెను ముప్పు వంటిదని, సిమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి కట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రధాని చెప్పిన మాటలను సీసీ ఆమోదించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    నరేంద్ర మోదీ

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం

    ప్రధాన మంత్రి

    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్

    గణతంత్ర దినోత్సవం

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక నరేంద్ర మోదీ
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు దిల్లీ
    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023