NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
    తదుపరి వార్తా కథనం
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
    రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది పాల్గొనబోతున్నట్లు ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడి

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది

    వ్రాసిన వారు Stalin
    Jan 25, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌‌ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు.

    'బస్తర్ ఫైటర్స్' టీమ్‌ తరఫున ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌‌‌లో పాల్గొబోతున్నట్లు సుందర్‌రాజ్ పేర్కొన్నారు. 'బస్తర్ ఫైటర్స్' అనేది బస్తర్‌లోని మావోయిస్టు ప్రభావిత విభాగాలలో మోహరించిన ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక విభాగం.

    థర్డ్ జెండర్‌ సిబ్బంది పరేడ్‌లో పాల్గొనడం వల్ల సమాజానికి మంచి సందేశాన్ని పంపించినట్లు అవుతుందని ఐజీపీ పి.సుందర్‌రాజ్ పేర్కొన్నారు. వీరు అందిస్తున్న సేవల వల్ల బస్తర్‌లోని ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

    పరేడ్‌‌‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా పాల్గొంటారు.

    ఛత్తీస్‌గఢ్‌‌

    2022లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్ల నియామకం

    ఛత్తీస్‌గఢ్‌‌ పోలీసు విభాగం 2022లో 'బస్తర్ ఫైటర్స్' కోసం నియామకాలను చేపట్టింది. అందులో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లను నియమించుకుంది. కాంకేర్ జిల్లా నుంచి ఎనిమిది మంది, బస్తర్‌కు చెందిన ఒకరు రిక్రూట్‌ అయ్యారు. ఉద్యోగానికి ఎంపికైన 608 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

    జనవరి 26న దేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతంది. దిల్లీలోని ఎర్రకోటపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది.

    74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం అయన ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025