NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
    భారతదేశం

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 25, 2023, 03:27 pm 1 నిమి చదవండి
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
    రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది పాల్గొనబోతున్నట్లు ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడి

    ఛత్తీస్‌గఢ్‌‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌‌ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు. 'బస్తర్ ఫైటర్స్' టీమ్‌ తరఫున ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌‌‌లో పాల్గొబోతున్నట్లు సుందర్‌రాజ్ పేర్కొన్నారు. 'బస్తర్ ఫైటర్స్' అనేది బస్తర్‌లోని మావోయిస్టు ప్రభావిత విభాగాలలో మోహరించిన ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక విభాగం. థర్డ్ జెండర్‌ సిబ్బంది పరేడ్‌లో పాల్గొనడం వల్ల సమాజానికి మంచి సందేశాన్ని పంపించినట్లు అవుతుందని ఐజీపీ పి.సుందర్‌రాజ్ పేర్కొన్నారు. వీరు అందిస్తున్న సేవల వల్ల బస్తర్‌లోని ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పరేడ్‌‌‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా పాల్గొంటారు.

    2022లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్ల నియామకం

    ఛత్తీస్‌గఢ్‌‌ పోలీసు విభాగం 2022లో 'బస్తర్ ఫైటర్స్' కోసం నియామకాలను చేపట్టింది. అందులో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లను నియమించుకుంది. కాంకేర్ జిల్లా నుంచి ఎనిమిది మంది, బస్తర్‌కు చెందిన ఒకరు రిక్రూట్‌ అయ్యారు. ఉద్యోగానికి ఎంపికైన 608 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. జనవరి 26న దేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతంది. దిల్లీలోని ఎర్రకోటపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం అయన ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు తెలుగు సినిమా
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్

    ఛత్తీస్‌గఢ్

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ కాంగ్రెస్
    కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు కాంగ్రెస్

    గణతంత్ర దినోత్సవం

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక నరేంద్ర మోదీ
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు దిల్లీ
    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023