NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ
    భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ

    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.

    ఈ సందర్భంగా, భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ,వారి శౌర్యాన్ని ప్రశంసించారు.

    అలాగే,ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రస్తావించారు.సైనికులను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడుతూ.."మన సోదరీమణుల కుంకుమను తుడిచే ప్రయత్నం చేసిన ఉగ్రవాదులను వారి ఇంట్లో దూరి హతమార్చిన ఘనత భారత సైన్యానికి చెందుతుంది. మన సైన్యం ధైర్యంగా నిలబడి ఉగ్రవాదుల స్థావరాలను సమూలంగా ధ్వంసం చేసింది.ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేశారు. భారత ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎలా ఎదుర్కోవాలో భారత సైన్యం చూపించింది.మన డ్రోన్లు,క్షిపణుల సామర్థ్యం చూసి పాకిస్థాన్‌కు నిద్ర పట్టడం లేదని" అన్నారు.

    వివరాలు 

    రాబోయే తరాలకు స్ఫూర్తి

    భవిష్యత్తులో, అంటే నేటి నుండి పదేళ్ల తర్వాత కూడా భారత శౌర్యంపై చర్చ జరుగుతుంటే, ఆ సమయంలో మీ అందరినీ ప్రేరణగా ప్రస్తావించక తప్పదు అని సైనికులను అభినందించారు.

    మీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.

    "ఈ వేదికపై నుంచి త్రివిధ దళాలు,బీఎస్ఎఫ్‌కు నేను సెల్యూట్ చేస్తున్నాను.మీ ధైర్యసాహసాల కారణంగా 'ఆపరేషన్ సింధూర్'పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది" అని అన్నారు.

    ఈ యుద్ధంలో భారత సమాజం మొత్తం సైన్యానికి అండగా నిలబడిందని, ప్రతి భారతీయుడు మీ విజయానికి ప్రార్థన చేశాడని గుర్తు చేశారు.

    వివరాలు 

    మీరు చరిత్ర సృష్టించారు

    భారతీయులందరికి భారత సైనిక బలగాలు, వారి కుటుంబాల పట్ల గొప్ప గౌరవం, కృతజ్ఞత ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

    భారతదేశం బుద్ధుడి, గురు గోవింద్ సింగ్ వంటి మహానుభావుల పుణ్య భూమి అని అన్నారు.

    కొన్ని దేశాల నుంచి వచ్చిన అణుబాంబు ముప్పులను భారత సైన్యం ధైర్యంగా తిప్పికొట్టిందని, ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఒక్కటే.. "భారత్ మాతాకీ జై" అని చెప్పారు.

    "మీరు చరిత్ర సృష్టించారు. మీ అందరిని వ్యక్తిగతంగా కలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను" అని మోదీ తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ వినండి 

    Interacted with the air warriors and soldiers at AFS Adampur. Their courage and professionalism in protecting our nation are commendable. https://t.co/hFjkVIUl8o

    — Narendra Modi (@narendramodi) May 13, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..! జీవనశైలి
    Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు! అమెజాన్ ప్రైమ్

    నరేంద్ర మోదీ

    PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం  భారతదేశం
    Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి?  భారతదేశం
    PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ భారతదేశం
    Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025