Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే..
PM Modi inaugurates Sudarshan Setu: భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రడ్జిని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్లోని ఓఖాను బేట్ ద్వారక ద్వీపాన్ని కలిపే నాలుగు లేన్ల కేబుల్-స్టేడ్ వంతెనకు 'సుదర్శన్ సేతు (Sudarshan Setu)' అని పేరు పెట్టారు. 'సుదర్శన్ సేతు' అనేది ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్. దీని నిర్మాణానికి 900కోట్లకు పైగా ఖర్చు చేశారు. వంతెన ప్రారంభానికి ముందు మోదీ బైట్ ద్వారక ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఇదివరకు బెట్-ద్వారకలోని ద్వారకాధీశుని ఆలయానికి వెళ్లే భక్తులు పడవలో వెళ్లేవారు. పడవలో ప్రయాణం భయంకరంగా ఉండేది. భక్తుల సౌకర్యార్థం బాట్ ద్వారక ద్వీపానికి వెళ్లేందుకు వీలుగా మోదీ ఈ కేబుల్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
శ్రీ కృష్ణుడు నివసించింది ఈ ద్వీపంలోనే..
గుజరాత్లోని ద్వారక జిల్లాలో మొత్తం 21దీవులు ఉన్నాయి. ఇందులో బాట్ ద్వారక ద్వీపంలో 12వేలకు పైగా జనాభా ఉంది. శ్రీ కృష్ణుడు బ్యాట్ ద్వారకలో నివసించినట్లు చరిత్ర చెబుతుంది. ఇది కాకుండా హనుమంజీ, అతని కుమారుడు మకరధ్వజ్ ఆలయం కూడా ద్వారక ద్వీపంలో ఉంది. ప్రపంచం మొత్తం మీద మకరధ్వజ దేవాలయం ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది. దీంతో ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. బాట్ ద్వారక ద్వీపంలోని ఆలయాలను సందర్శించేదుకు సంవత్సరాలుగా భక్తులు బోట్ల ద్వారా ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు యాత్రికుల పడవ ప్రయాణాలను నిలిపివేసేవారు. దీంతో అన్ని వేళలా యాత్రికులు ద్వారకా ద్వీపానికి వెళ్లేలా మోదీ 'సుదర్శన్ సేతు' ప్రాజెక్టును ప్రకటించారు.
900 మీటర్ల పొడవైన సెంట్రల్ కేబుల్ మాడ్యూల్పై వంతెన నిర్మాణం
'సుదర్శన్ సేతు' వంతెన ఓఖా నుంచి బెట్ ద్వారకను రోడ్డు మార్గంలో కలుపుతుంది. ఓఖా- బెట్ ద్వారకలను కలిపే నాలుగు లేన్ల సిగ్నేచర్ వంతెనను 900 మీటర్ల పొడవైన సెంట్రల్ కేబుల్ మాడ్యూల్పై నిర్మించారు. ఓఖా- బెట్ ద్వారకకు ఇరువైపులా 2452 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నారు. దీంతో వంతెన మొత్తం పొడవు 2320 మీటర్లు అవుతుంది. ప్రధాన వంతెన పొడవు 500 మీటర్లు. భారతదేశంలో ఇంత విస్తర్ణంలో నిర్మించే కేబుల్ వంతెన లేదు. ఈ వంతెన 30 మీటర్ల ఎత్తుతో రెండు పైలాన్లను కలిగి ఉంది. పాదచారుల కోసం వీక్షణ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఆ ప్రదేశం నుంచి బెట్ద్వారక, సముద్రం అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
పర్యాటక కేంద్రంగా 'సుదర్శన్ సేతు'
వంతెన రాత్రిపూట మెరిసిపోయేలా.. ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తద్వారా ఈ సిగ్నేచర్ బ్రిడ్జి పర్యాటకులకు కేంద్రంగా మారనుంది. ఈ బ్రిడ్జిలో యాత్రికుల కోసం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వంతెన ముందు వాహనాలు నిలిపేందుకు ఓఖా వైపు పార్కింగ్ను నిర్మిస్తారు. ఈ నాలుగు లేన్ల వంతెన వెడల్పు 27.20 మీటర్లు. ఇందులో ఇరువైపులా 2.50 మీటర్ల ఫుట్పాత్లు నిర్మిస్తారు. ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ 1 మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది వంతెనపై లైటింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఓఖా గ్రామ అవసరాల కోసం అదనపు విద్యుత్ను ఉపయోగించనున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ వంతెన బెట్-ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించే భక్తులను బోట్లలో వెళ్లకుండా దోహదపడుతుంది.