PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ రూ. 350 కోట్ల నల్లధనం, సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్పై మండిపడ్డారు. 'మనీహీస్ట్' డ్రామాను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ గత 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. "భారతదేశంలో,కాంగ్రెస్ పార్టీ ఉన్నపుడు మనీ హీస్ట్' కల్పన ఎవరికి అవసరం, 70 ఏళ్లుగా దోచుకుంటున్నారు" అంటూ పీఎం మోడీ ఎక్స్లో పోస్ట్లో పేర్కొన్నారు." కాంగ్రెస్ 'మనీ హీస్ట్ని ప్రజెంట్ చేస్తుంది!' అనే క్యాప్షన్తో బీజేపీ ఓ వీడియోను ఆ పోస్ట్ కి జత చేసింది.
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
మాటల యుద్దాన్ని ప్రారంభించిన బిజెడి,బీజేపీ, కాంగ్రెస్
ఒడిశా, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.353 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అధికారుల ప్రకారం, దేశంలో దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లో ఇదే అత్యధికం. ఈ నగదు రికవరీ తర్వాత, ఒడిశాలో అధికార పార్టీ, బిజూ జనతా దళ్(బిజెడి),బిజెపి, కాంగ్రెస్లు మాటల యుద్దాన్ని ప్రారంభించాయి. గత రెండు దశాబ్ధాలుగా ఒడిశాలో దేశీ మద్యం వ్యాపారాన్ని చేపట్టేందుకు సాహు సోదరులకు బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని ఒడిశాలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ను ప్రశ్నించగా, రాష్ట్రంలోని బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని బిజెడి బిజెపిపై ఎదురుదాడి చేసింది.