NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ 
    కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ

    PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ రూ. 350 కోట్ల నల్లధనం, సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

    'మనీహీస్ట్' డ్రామాను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ గత 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. "భారతదేశంలో,కాంగ్రెస్ పార్టీ ఉన్నపుడు మనీ హీస్ట్' కల్పన ఎవరికి అవసరం, 70 ఏళ్లుగా దోచుకుంటున్నారు" అంటూ పీఎం మోడీ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు."

    కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్‌ని ప్రజెంట్ చేస్తుంది!' అనే క్యాప్షన్‌తో బీజేపీ ఓ వీడియోను ఆ పోస్ట్ కి జత చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

    In India, who needs 'Money Heist' fiction, when you have the Congress Party, whose heists are legendary for 70 years and counting! https://t.co/J70MCA5lcG

    — Narendra Modi (@narendramodi) December 12, 2023

    Details 

    మాటల యుద్దాన్ని ప్రారంభించిన బిజెడి,బీజేపీ, కాంగ్రెస్‌ 

    ఒడిశా, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.353 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

    అధికారుల ప్రకారం, దేశంలో దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లో ఇదే అత్యధికం.

    ఈ నగదు రికవరీ తర్వాత, ఒడిశాలో అధికార పార్టీ, బిజూ జనతా దళ్(బిజెడి),బిజెపి, కాంగ్రెస్‌లు మాటల యుద్దాన్ని ప్రారంభించాయి.

    గత రెండు దశాబ్ధాలుగా ఒడిశాలో దేశీ మద్యం వ్యాపారాన్ని చేపట్టేందుకు సాహు సోదరులకు బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని ఒడిశాలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.

    బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌ను ప్రశ్నించగా, రాష్ట్రంలోని బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని బిజెడి బిజెపిపై ఎదురుదాడి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు దిల్లీ
    హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ భారతదేశం
     ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌
    PM Modi: అక్టోబర్ 27న ఐఎంసీని ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025