
Engineering colleges: తెలంగాణలో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్ కళాశాలల బంద్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ఇంజినీరింగ్,ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో నవంబరు 3 నుంచి బంద్ నిర్వహించనున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది. ఈ నెల 22న ప్రభుత్వం కు నోటీసు అందజేయనున్నట్లు సమాఖ్య తెలిపింది. సమాఖ్య కోర్ కమిటీ ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా 25వ తేదీన విద్యార్థి సంఘాలతో, 26వ తేదీన సర్వసభ్య సమావేశాలు జరపాలని, అలాగే నవంబరు 1వ తేదీ నాటికి అన్ని పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్
నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2025
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే బంద్ తప్పదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల హెచ్చరిక
హామీ ఇచ్చినట్లుగా నవంబర్ 1వ తేదీ లోపు రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్
ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు… https://t.co/CWW19XjXHf pic.twitter.com/A3OxYP32r1