NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap news: నవ్యాంధ్ర చరిత్రలో తొలిసారి.. 175 నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమల పార్కు
    తదుపరి వార్తా కథనం
    Ap news: నవ్యాంధ్ర చరిత్రలో తొలిసారి.. 175 నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమల పార్కు
    నవ్యాంధ్రలో 175 నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమల పార్కు

    Ap news: నవ్యాంధ్ర చరిత్రలో తొలిసారి.. 175 నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమల పార్కు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 17, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు పరిశ్రమల పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    ఈ పార్కులను అభివృద్ధి చేసే ఔత్సాహికులకు తగిన ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని బుధవారం మంత్రిమండలి ఆమోదించింది.

    ఈ విధానం కింద ఎవరైనా ప్రైవేటు పరిశ్రమల పార్కులను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక ప్రైవేటు పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    మొత్తం 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల కేంద్రాలు ఏర్పాటవుతాయి. భూమిని కొనుగోలు చేసి పరిశ్రమలను అభివృద్ధి చేయడం సాధ్యం కాని చిన్న పరిశ్రమలకు ఈ ప్రైవేటు పార్కులు దన్నుగా నిలుస్తాయి.

    వివరాలు 

    పాలసీలో ముఖ్యాంశాలు

    ఈ పార్కుల్లో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి..అందులో స్టోరేజి, ఉత్పత్తుల స్థలం, రవాణా సదుపాయాలు ప్రధానంగా ఉంటాయి.

    కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రైవేటు పార్కులు విజయవంతంగా అమలు చేయబడుతున్నాయి.

    ఈ ప్రైవేటు పార్కులను 100% ప్రైవేటు భూమిలో లేదా పాక్షికంగా ప్రభుత్వ భూమిలో లేదా పూర్తిగా ప్రభుత్వ భూమిలో అభివృద్ధి చేయవచ్చు.

    చిన్న పరిశ్రమలకు ఈ పార్కులు ప్రోత్సాహకాలు అందిస్తాయి.

    పార్కును అభివృద్ధి చేసే అభివృద్ధిదారులు సాధారణ మౌలిక సదుపాయాలు కల్పించాలి.

    రహదారులు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుంది.

    వివరాలు 

    వినియోగం ఇలా ఉంటుందని అంచనా

    ప్రభుత్వం మూలధన రాయితీ కింద ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుంది.

    నాలా, లే అవుట్ అప్రూవల్, స్టాంప్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపుగా ఉంటాయి.

    ఆక్వా, వ్యవసాయ, బయో టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి అనేక పరిశ్రమల కోసం ఈ పార్కులను వినియోగించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఆంధ్రప్రదేశ్

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు నారా లోకేశ్
    Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్ ధర
    Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు పోలీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025