NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం
    క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం

    Reviving the Ganga: క్లీన్ గంగా కోసం యూపీ లోని చందౌలీ,మాణిక్‌పూర్‌లలో 272 కోట్ల ప్రాజెక్ట్ కు ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 01, 2025
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది.

    ఈ సమావేశం ఎన్‌ఎంసిజి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ మిట్టల్ అధ్యక్షతన నిర్వహించబడింది.

    గంగా నది పరిరక్షణ,పునరుద్ధరణ కోసం ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను ఆమోదించారు.

    ఈ ప్రాజెక్టుల లక్ష్యం నది పరిశుభ్రత,సుస్థిర అభివృద్ధి,పర్యావరణ పరిరక్షణ,సాంస్కృతిక ప్రాముఖ్యతలను ప్రోత్సహించడం.

    ఉత్తరప్రదేశ్‌లో గంగా నది పునరుజ్జీవనం,పరిశుభ్రత కోసం ఎన్‌ఎంసిజి ఎగ్జిక్యూటివ్ కమిటీ మరింత బలోపేతం చేసిన ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించింది.

    చందౌలీ, మాణిక్‌పూర్ ప్రాంతాలకు రూ.272 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించారు.

    వివరాలు 

    బక్సర్‌లో నదీ పరిరక్షణ కోసం మరో కీలక ప్రాజెక్టు

    చందౌలీలో రూ.263 కోట్ల అంచనా వ్యయంతో ఉన్న ప్రాజెక్టు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ను అనుసరిస్తుంది.

    ఈ ప్రాజెక్టులో 45 ఎంఎల్ డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం,ఇతర సహాయక నిర్మాణాల నిర్మాణం కలిగి ఉంటుంది.

    ఈ ప్రాజెక్ట్ 15 సంవత్సరాల పాటు నది నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించబడింది.

    అదనంగా,ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మాణిక్‌పూర్ వద్ద 9కోట్ల రూపాయల వ్యయంతో మల బురద నిర్వహణ ప్రాజెక్ట్ కూడా ఆమోదించబడింది.

    బీహార్ రాష్ట్రంలోని బక్సర్‌లో నదీ పరిరక్షణ కోసం మరో కీలక ప్రాజెక్టు ఆమోదించబడింది.

    ఈ ప్రాజెక్టు రూ.257 కోట్లతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది, ఇది నిర్మాణం మాత్రమే కాకుండా, రాబోయే 15 సంవత్సరాల పాటు సుస్థిర ఆపరేషన్, నిర్వహణ వ్యవస్థను నిర్ధారిస్తుంది.

    వివరాలు 

    బక్సర్‌లో ఆధునిక,స్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కీలకమైన అడుగులు 

    ఇందులో 50 ఎంఎల్డీ సామర్థ్యం గల అత్యాధునిక మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) సహాయక నిర్మాణాలు కూడా ఉన్నాయి.

    ఈ ప్రాజెక్టులో మూడు ఇంటర్‌సెప్షన్ పంపింగ్ స్టేషన్‌లు, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగించి అదనంగా 1 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మించడం, అలాగే 8.68 కి.మీ పొడవైన మురుగునీటి నెట్‌వర్క్ అభివృద్ధి చేయడం వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

    ఈ కార్యక్రమం బక్సర్‌లో ఆధునిక, స్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కీలకమైన అడుగులు వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ
    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్
    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్

    ఉత్తర్‌ప్రదేశ్

    UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్  ఇండియా
    Operation Bhediya: బహరాయిచ్‌ లో.. 5 ఏళ్ల బాలికపై  తోడేలు దాడి  భారతదేశం
    UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!! భారతదేశం
    Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025