NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు
    పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు

    Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.

    నాటి వైసీపీ ప్రభుత్వం నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపుల స్థానంలో ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

    దీనికి కారణంగా నాసిరకం కాగితాలను వినియోగించడంపై క్రయవిక్రేతలు నిరసన వ్యక్తం చేశారు.

    జిరాక్స్‌ పేపర్ల మాదిరిగా ఉంటాయని వారు ఆందోళన చెందారు. ఉద్దేశపూర్వకంగా స్టాంప్‌పేపర్ల కొరతను సృష్టించి ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని నాటి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శలు వచ్చాయి.

    ఈ సమస్యపై తాజాగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సమీక్షించారు.

    క్రయవిక్రేతల అవసరాలకు అనుగుణంగా నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లను రాష్ట్రంలోని 290 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

    వివరాలు 

    అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు

    వాస్తవానికి, స్టాంప్‌పేపర్ల విక్రయంతో ప్రభుత్వానికి ఏటా రూ.50 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, నాటి వైసీపీ ప్రభుత్వం అంతే మొత్తంలో నష్టం వస్తుందని ఈ-స్టాంపింగ్‌ను ప్రారంభించింది.

    లొసుగులను గుర్తించి న్యాయస్థానమూ గతేడాది జనవరిలో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.

    తీర్పుపై అప్పటి ప్రభుత్వం వెంటనే రివిజన్‌ పిటిషన్‌ సమర్పించి ఈ-స్టాంపింగ్‌ను కొనసాగించింది.

    ఇదే శాశ్వతమని, స్టాంప్‌పేపర్లను ఉపయోగించబోమని మరీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ప్రచారం చేశారు.

    కాగితం నాణ్యతను పరిగణనలోకి తీసుకోకుండా, అనంతపురం తదితర కొన్ని జిల్లాల్లో అవి దొరకకపోతే ఒక్కో స్టాంపుపై రూ.50 నుంచి రూ.వంద వరకు అదనంగా వసూలు చేశారు.

    వివరాలు 

    నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్ల సమీకరణ 

    రూ.10, రూ.20, రూ.50, రూ.100 నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లను గతంలో తపాలా శాఖ ద్వారా విక్రయించడానికి సిద్ధం చేశారు.

    ప్రస్తుతం సుమారు రూ.కోటి విలువైన నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లు ఆ శాఖ వద్దే ఉన్నాయి.

    వీటిని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అందించడానికి ప్రక్రియ మొదలైంది. రూ.50 విలువైన పది లక్షల స్టాంప్‌పేపర్లు, రూ.100 విలువైన 10 లక్షల నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లు కూడా రెండు వారాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చేరుకునేలా ఉన్నాయి.

    క్రయవిక్రేతలకు సెంటిమెంట్‌గా ఉన్న నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లను అవసరాలకు అనుగుణంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉంచుతున్నామని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు తెలిపారు.

    వివరాలు 

    ఏటా సుమారు రూ.120 కోట్ల విలువైన స్టాంప్‌పేపర్లు

    రాష్ట్రానికి హైదరాబాద్‌ నుంచి రూ.10, రూ.20, నాసిక్‌ నుంచి రూ.50, రూ.100 విలువైన స్టాంప్‌పేపర్లు ఏటా సుమారు రూ.120 కోట్ల విలువైనవి వస్తున్నాయని చెప్పారు.

    జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం ముద్రించిన రూ.20 విలువైన 8 లక్షల స్టాంప్‌పేపర్లు హైదరాబాద్‌లోని ముద్రణ సంస్థలో ఇప్పటికీ ఉన్నాయి.

    వాటిని తెప్పించేందుకు యత్నిస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం స్టాక్‌హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ-స్టాంపింగ్‌ అమల్లో అక్రమాలు, నాటి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలపై విజిలెన్స్‌ విచారిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    ఆంధ్రప్రదేశ్

    Ap Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే భారతదేశం
    Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు భారతదేశం
    AP Free Gas Cylinder Scheme: ఏపీలోఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీం.. అర్హతలేంటి? ఏయే పత్రాలు కావాలి? భారతదేశం
    AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం అదానీ గ్రూప్

    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025