NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 
    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

    Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.

    కొద్ది గంటలకే, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ తన కేబినెట్‌ను పునఃవ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకున్నారు.

    ఈ క్రమంలో, ఆయన ఐదుగురు కొత్త మంత్రులను తన కేబినెట్‌లోకి చేర్చబోతున్నారు.

    సోమవారం రాజ్‌భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

    అదే సమయంలో, మాన్ కేబినెట్‌లో ఉన్న నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి మాన్ తొలగించాలని నిర్ణయించారు.

    కొత్తగా కేబినెట్‌లో చోటు పొందిన ఎమ్మెల్యేలు:

    బిరిందర్ కుమార్ గోయల్,డాక్టర్ రాజివట్,తరణ్ ప్రీత్ సింగ్,మహిందర్ భగత్, హర్దీప్ సింగ్.

    ఇక చేతన్ సింగ్,శంకర్ జింపా,బల్కర్ సింగ్,అన్మోల్ గగన్ మాన్ కేబినెట్ నుండి విద్వాసన పొందుతున్నారు.

    వివరాలు 

    స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో నిర్ణయం 

    మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    అయితే, మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

    ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడ సంతకం చేయకూడదని సుప్రీంకోర్టు ఆయనకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

    వివరాలు 

    అతిషితో బాటు  మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు

    అటు, ముఖ్యమంత్రి పదవికి అతిషిని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో అతిషి శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ఆమెతోపాటు మరికొన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణం చేశారు.

    అక్టోబర్ 1న ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు.

    న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ మార్పులు చోటు చేసుకున్న కొన్ని గంటలకే, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా దాదాపు ఇదే విధంగా ఘటనలు జరిగినవి గమనించదగిన విషయం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పంజాబ్

    Punjab: లూథియానాలోని ఫర్నిచర్ ఫ్యాక్టరీ గోదాములో అగ్నిప్రమాదం భారతదేశం
    Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్‌ సింగ్ హతం  అమృత్‌సర్
    BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్ పాకిస్థాన్
    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025