తదుపరి వార్తా కథనం
Putin India Visit: హైదరాబాద్ హౌస్లో మోదీ-పుతిన్ భేటీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 05, 2025
01:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ హౌస్లో ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం తటస్థంగా లేదని శాంతిపక్షాన ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్, రష్యా ప్రతినిధి బృందాన్ని స్వాగతిస్తూ, ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుండే భారత్, రష్యా మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు.