
Raghurama: డీజీపీకి రఘురామ లేఖ.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద చర్యల డిమాండ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆయన అధికారికంగా లేఖ రాశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా సజ్జల మాట్లాడారని, కులాన్ని దూషించే పదాలను వాడారని ఆరోపించారు.
దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సజ్జల వ్యాఖ్యల వల్ల అమరావతి ప్రాంతంలోని వేలాది మంది మహిళలు మానసికంగా బాధపడ్డారని లేఖలో పేర్కొన్నారు.
Details
కఠిన చర్యలు తీసుకోవాలి
భవిష్యత్తులో మరోకరు ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో సజ్జల మాట్లాడుతూ 'పిశాచాలు కూడా ఇలా చేయవు. వారిని రాక్షసులు అనడం కూడా తక్కువే అవుతుంది.
ఇదొక సంకర తెగలాగా ఉంది. ఈ తెగ కలిసి వ్యవస్థీకృతంగా పనిచేస్తోంది. సహజంగా ఏ మహిళా అలా ప్రవర్తించదు. ఇది స్పష్టంగా ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు.