LOADING...
Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది మహిళలకు మేలు చేసే చట్టం కాదని, మహిళా సాధికారతతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. మహిళలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన చర్య అని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు అన్ని కలసి ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటాయని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే, అధికార పార్టీ తన బలం తగ్గిపోతుందనే భయంతో దేశ రాజకీయ రూపురేఖలను మార్చేందుకు ఈ ప్రక్రియను ముందుకు తెచ్చిందని ఆయన విమర్శించారు.

వివరాలు 

ఓబీసీలకు అన్యాయం.. దక్షిణ రాష్ట్రాలకు ముప్పు

ఈ బిల్లు వెనుక అసలు లక్ష్యం వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కకుండా చేయడమేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. సామాజిక వర్గాల లెక్కింపు జరగకుండా అడ్డుకోవడమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో వారికి ప్రాతినిధ్యం లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. అదే సమయంలో, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ రాష్ట్రాల హక్కులను కించపరిచే చర్యలను తాము సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, గతంలో ప్రవేశపెట్టిన పాత చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా దానిని అమలు చేస్తే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

వివరాలు 

ఇందిరా గాంధీ చెప్పిన పాఠం.. చీకటిలోని నిజం

తన ప్రసంగంలో రాహుల్ గాంధీ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ సభను భావోద్వేగానికి గురిచేశారు. తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనకు నేర్పిన ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు చీకటి అంటే భయం ఉండేదని, ఒకరోజు ఆమె తన చేయి పట్టుకుని చీకటిగా ఉన్న తోటలోకి తీసుకెళ్లి ఒంటరిగా ఉండమని చెప్పిన విషయాన్ని వివరించారు.

Advertisement

వివరాలు 

'సత్యమే అందమైనది'

ఆ సమయంలో తనకు చాలా భయం వేసిందని తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఆమె తిరిగి వచ్చి, "నువ్వు చీకటికి కాదు... నీ మనసులోని ఊహలకు భయపడుతున్నావు. నిజం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. ఆ భయాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లే ధైర్యం లేకపోతే నిజాన్ని తెలుసుకోలేవు" అని చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ పాఠం తన జీవితంలో నిజాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపిందని, 'సత్యమే అందమైనది' అనే భావనను తనకు బోధించిందని ఆయన అన్నారు.

Advertisement