NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం
    భారతదేశం

    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం

    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 31, 2022, 01:23 pm 0 నిమి చదవండి
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు

    రైళ్లలో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 15,000 కోచ్‌లను సీసీ కెమెరాల నీడలోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 705 కోట్లను కేటాయించింది. రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలోని 14, 387 కోచ్‌లతో పాటు ఈఎంయూ, ఎంఈఎంయూ, డీఈఎంయూ ప్యాసింజర్ ట్రైన్లలో కూడా ఈ సీసీ కెమెరాలను అమర్చనున్నారు. 2,930 రైలు కోచ్‌లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నట్లు గత ఏడాది రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను దాదాపు ఐదు రెట్లు పెంచింది కేంద్రం.

    అత్యాధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలు..

    రైళ్లలో వీడియోలు, ఫేస్‌లను కచ్చితంగా గుర్తించే అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీటీవీలను అమర్చనున్నారు. తద్వారా డివిజనల్, జోనల్ ప్రధాన కార్యాలయాల నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా అన్ని కోచ్‌లను ఆర్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించడం సులభం కానుంది. ప్రయాణించే క్రమంలో రైళ్లలో ఎలాంటి సంఘటన జరిగినా.. కొత్తగా అమర్చనున్న సీసీ కెమెరాలతో నియంత్రించడానికి తేలిక అవుతుంది. ఈ సీసీ కెమెరాలు హై రిజల్యూషన్ చిత్రాలను అందించడం వల్ల.. దుండగులను గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. భవిష్యత్‌లో విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని.. ఈ సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    భారతదేశం

    మార్చి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్

    రైల్వే శాఖ మంత్రి

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! హైదరాబాద్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ దిల్లీ
    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు గ్రీస్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023