NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్ 
    రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్

    రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్ 

    వ్రాసిన వారు Stalin
    Oct 25, 2023
    04:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భూ వివాదంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.

    బయానా ప్రాంతంలోని అడ్డా గ్రామంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు యువకుడిని ట్రాక్టర్‌తో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8సార్లు తొక్కించి దారుణంగా హత్య చేశారు.

    ఈ ఘటన బుధవారం జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    బయానాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డా గ్రామంలో బహదూర్, అతర్ సింగ్ గుర్జార్ కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది.

    4రోజుల క్రితం, ఇరువర్గాలు సదర్ పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు, అయితే బుధవారం ఉదయం, భూమి వివాదంపై ఇరువర్గాలు మరోసారి ఘర్షణకు దిగారు.

    హత్య

    కేసు నమోదు చేసిన పోలీసులు

    బహదూర్ వర్గానికి చెందిన వ్యక్తి బుధవారం ఉదయం ట్రాక్టర్‌తో వివాదాస్పద స్థలంలోకి వెళ్లాడు. అతర్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా కూడా భూమి వద్దకు వెళ్లారు.

    ఈ సమయంలో అతర్ సింగ్ వర్గానికి చెందిన నిర్పత్ అనే యువకుడు ట్రాక్టర్‌ను ఆపడానికి నేలపై పడుకున్నాడు.

    బహదూర్ వర్గానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్‌ను నిర్పత్ పై నుంచి పోనిచ్చాడు. అలా ఏకంగా 8సార్లు ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో నిర్పత్ అక్కడిక్కడే చనిపోయాడు.

    గొడవ చూడటానికి వచ్చిన గ్రామస్థులు.. ఈ ఘటనను వీడియో తీయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    హత్య
    తాజా వార్తలు

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    రాజస్థాన్

    రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు జోధ్‌పూర్
    మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు మణిపూర్
    ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే! తాజా వార్తలు
    NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    హత్య

    జిమ్ నుంచి ఇంటికెళ్తున్న వైసీపీ కార్యకర్త.. బురఖా కప్పుకుని వచ్చి హత్య చేసిన ప్రత్యర్థులు వైఎస్సార్ కడప
    యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు ఉత్తర్‌ప్రదేశ్
    గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య  హర్యానా
    ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు  ఇజ్రాయెల్
    Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ దిల్లీ
    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025