Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేందుకు హిందువులు సిద్ధమవుతున్నారు. మారిషస్లోని హిందూ ఉద్యోగులకు ఆ దేశ ప్రభుత్వం 22న 2 గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేసింది. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. భారత్లో జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నందున ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మేరకు మారిషస్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. మారిషస్లో హిందూ మతం అత్యంత ప్రముఖమైనది. ఈ దేశంలో హిందూమతాన్ని ఆచరించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.