Page Loader
Reliance: ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ 
ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్

Reliance: ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్‌ ఎనర్జీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడులలో భాగంగా రిలయన్స్‌ సంస్థ 500 ఆధునిక బయో గ్యాస్‌ ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. గత నెలలో ముకేష్ అంబానీ, అనంత్‌ అంబానీలు ముంబయిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ సమావేశంలో గ్రీన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎనర్జీ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చే ప్రాధాన్యతను మంత్రి లోకేశ్‌ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల పై త్వరలోనే అనంత్‌ అంబానీ, లోకేశ్‌ మధ్య అవగాహన ఏర్పడింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన పూర్వస్థాయి రోడ్‌మ్యాప్‌తో, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరగనుంది.