
PJR Flyover: హైదరాబాద్ ట్రాఫిక్కు ఉపశమనం.. నేటి నుంచి కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల నివారణకు మరో కీలక ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు నిర్మించిన శిల్పా లే అవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొననున్నారు.
Details
రూ.182.75 కోట్ల వ్యయంతో నిర్మాణం
ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో మాదాపూర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్పోర్టు వంటి కీలక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభమవుతుంది. దీంతో ట్రాఫిక్ బాధలు చాలా వరకు తీరనున్నాయి. ఐటీ కారిడార్లో రద్దీ తగ్గించి, ప్రయాణ సమయంలో మెరుగైన అనుభూతిని కలిగించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. మొత్తంగా 182.75 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్ల ఈ మూడో స్థాయి ఫ్లైఓవర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫ్లైఓవర్కు మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజేఆర్ (పి. జనార్దన్ రెడ్డి) పేరు పెట్టారు.