KJS Dhillon: 'జైష్ సిగ్నేచర్ క్లియర్'.. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్పై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లన్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడిని పుల్వామా స్టైల్లోనే జరిగిందని, అది పూర్తిగా జైషే మహ్మద్ చేతివ్రాతలా కనిపిస్తోందని అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, ఈ దాడి విధానం పుల్వామాకి పోలికలు ఉన్నాయని చెప్పారు. పాక్ డీప్ స్టేట్, ముఖ్యంగా ఐఎస్ఐ మద్దతు ఉన్నదనే అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. భారత్ ముందున్న పరిస్థితిని "టికింగ్ టైం బాంబ్"గా అభివర్ణిస్తూ, ఇది దేశం అత్యంత గంభీరంగా తీసుకోవాల్సిన విషయం అని ధిల్లన్ హెచ్చరించారు. "పాకిస్థాన్ డీప్ స్టేట్కి ఒక్కటే అజెండా.. భారతదేశంలో టెరర్ వ్యాప్తి. జైష్ అన్నది ఆ వ్యవస్థ పుట్టించిన, పెంచుకున్న పావులాంటిది," అని చెప్పారు.
వివరాలు
ప్రతి పౌరుడూ యూనిఫార్మ్ లేని సైనికుడే..
బస్టెడ్ మెటీరియల్ గురించి మాట్లాడుతూ, 20 డెటోనేటర్లు, 24 రిమోట్ కంట్రోల్ యూనిట్లు 150 కిలోల బరువు ఉన్న 20 వేర్వేరు బాంబులను పేల్చే సామర్థ్యం కలిగివున్నాయని తెలిపారు. "ఇవి ఒకేసారి దేశంలోని పలు చోట్ల పేల్చివేయగలిగే స్థాయిలో ఉన్నాయి.జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి జరిగి ఉంటే ఎంత భయంకరమైన నష్టం జరిగి ఉండేదో ఆలోచించండి. సెక్యూరిటీ ఫోర్సెస్,జమ్ముకశ్మీర్ పోలీసులు,ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ యాక్షన్ నిజంగా అభినందనీయం," అని ధిల్లన్ అన్నారు. ప్రతి పౌరుడూ యూనిఫార్మ్ లేని సైనికుడని,అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. "ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ముందు తప్పనిసరిగా పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయాలి.పరిసరాల్లో అనుమానం కలిగే ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు చెప్తే మంచిది,"అని కూడా సూచించారు.
వివరాలు
ఆ యాప్లను బ్యాన్ చేయడమే సరైన చర్య
ఇంటర్నెట్లో ఉన్న కొన్ని యాప్లు, లీగల్ ఏజెన్సీలు ఇంటర్సెప్ట్ చేయలేని కమ్యూనికేషన్ను ఉపయోగిస్తూ టెరర్ మాడ్యూల్స్ కోసం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. "అటువంటి యాప్ యజమానులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. వారి యాప్లు ఇండియాలో పనిచేయాలంటే, అవసరమైతే ప్రభుత్వం డేటా కోరగలిగే అధికారం ఉండాలి. అది ఇవ్వకపోతే ఆ యాప్లను బ్యాన్ చేయడమే సరైన చర్య. దేశ భద్రత, దేశ గౌరవం.. ఇవే ముందు. మిగతావన్నీ తర్వాతే," అని ధిల్లన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఒక వైద్యుడు నడిపిన కారు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో పేలిపోవడంతో 15 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్పై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లన్ సంచలన వ్యాఖ్యలు
#WATCH | In an exclusive conversation with ANI, Lt Gen (Retd) KJS Dhillon made a series of powerful and hard-hitting observations on the recent Red Fort attack — calling it a clear signature of Jaish-e-Mohammad with suspected backing from the ISI–Pak deep state. According to Lt… pic.twitter.com/HJhA18fHQ5
— ANI (@ANI) November 21, 2025