NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 
    దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ

    Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2025
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం వినియోగాన్ని కొంతవరకు తగ్గించి, గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలపై దృష్టి పెడుతున్నా, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా కొనసాగుతోంది.

    ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 నివేదిక స్పష్టం చేసింది.

    దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున 4.629 కేజీల బియ్యం వినియోగిస్తున్నారు.

    రాష్ట్రాల వారీగా చూస్తే, తెలంగాణ నెలకు తలసరి 8.4215 కేజీల వినియోగంతో 9వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 7.9185 కేజీలతో 12వ స్థానంలో ఉంది.

    దక్షిణాదిలో బియ్యం వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ రెండు ముందున్నాయి.

    Details

     గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య తేడా

    వీటి తరువాత తమిళనాడు 14వ స్థానం, కేరళ 18వ స్థానం, కర్ణాటక 20వ స్థానాల్లో నిలిచాయి.

    దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 5.065 కేజీల బియ్యం వినియోగం ఉండగా, పట్టణాల్లో 4.193 కేజీలు ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల వినియోగం పట్టణాల కంటే 21% అధికంగా ఉంది.

    తెలంగాణలో ఈ తేడా 23శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 9.299 కేజీలు, పట్టణాల్లో 7.544 కేజీలు చొప్పున వినియోగిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత వినియోగం 7.481 కేజీలు, పట్టణాల్లో 8.356 కేజీలు, మొత్తం సగటున 7.9185 కేజీలు ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో బియ్యం వినియోగం అత్యధికంగా ఉంది.

    Details

    కనీస వినియోగం ఉన్న రాష్ట్రాలు 

    మణిపుర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

    పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రజలు నెలకు 1 కేజీ బియ్యం కూడా వినియోగించడం లేదు.

    ఆంధ్రప్రదేశ్‌లో కిలో బియ్యం సగటున రూ.29, తెలంగాణలో రూ.31 ఖర్చవుతోందని నివేదిక వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Millets: చిరుధాన్యాలకు చిరునామాగా దక్షిణ భారత రాష్ట్రాలు .. ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనం భారతదేశం
    Para Gliding: అరకు ఉత్సవాలకు ముందు పారా గ్లైడింగ్‌ ట్రయల్ విజయవంతం భారతదేశం
    Kolikapudi: టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు భారతదేశం
    Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు భారతదేశం

    తెలంగాణ

    Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం పెద్దపల్లి
    Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం భారతదేశం
    E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు కరీంనగర్
    Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025