
Ladakh: లేహ్ వీధుల్లో అల్లర్లు.. రాష్ట్రహోదా కోసం లద్దాఖ్ ప్రజల ఆగ్రహం!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో బుధవారం ఉద్రిక్తతలు చెలరేగాయి. రాష్ట్రహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తమవడంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అధికారులపై రాళ్లు రువ్వడం, బీజేపీ కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019 ఆగస్టు 5న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లద్దాఖ్గా విభజించింది. అప్పటి నుంచి రాష్ట్రహోదా పునరుద్ధరణ కోసం నిరంతరం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రహోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలని కోరుతూ బుధవారం ఉదయం ఆందోళనకారులు లేహ్ వీధుల్లో ప్రదర్శన చేపట్టారు.
Details
హింసాకాండలోకి నిరసనలు
శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు కొంతసేపటికే హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు, బీజేపీ కార్యాలయం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లేహ్లో ఇలాంటి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర చర్చల నడుమ నిరసనలు ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు లద్దాఖ్ ప్రతినిధులను అక్టోబర్ 6న సమావేశానికి ఆహ్వానించిన సమయంలో ఈ నిరసనలు జరుగడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో
VIDEO | Leh, Ladakh: Police fired teargas shells and resorted to baton charge after a group of youths allegedly turned violent and pelted stones amid a massive protest and shutdown.
— Press Trust of India (@PTI_News) September 24, 2025
The protest was held in support of the demand to advance the proposed talks with the Centre on… pic.twitter.com/ebFGf8AeBO