NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!
    తదుపరి వార్తా కథనం
    KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!
    మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!

    KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా, వచ్చే ఏడాది జరుగనున్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటి.

    ఈ కార్యక్రమం సమయానికి అన్ని భద్రతా చర్యలు, ఏర్పాట్లను పటిష్టం చేయడానికి అధికారులు ఇప్పటికే సిద్ధం అవుతున్నారు.

    ప్రత్యేకంగా, కుంభమేళాలో జరిగే అనర్థాలను అడ్డుకోవడానికి రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    అంగీకారం ప్రకారం, 200 మంది అగ్నిమాపక కమాండోలను కూడా నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు.

    వివరాలు 

    హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 

    ఈ విషయాన్ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ మీడియాకు తెలియజేస్తూ,''అత్యవసర పరిస్థితులలో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబోటిక్ ఫైర్ టెండర్లు పంపిస్తాము.ప్రతి రోబో 20-25 కిలోల బరువుతో ఉంటుంది.ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవు. అంతేకాదు, 35 మీటర్ల ఎత్తు నుండి నీటిని చల్లి అగ్నిని శాసించేందుకు ఆర్టిక్యూలేటింగ్ వాటర్ టవర్‌లు,ఆధునిక కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం.ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తరహా ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్‌టీఆర్‌జీ యూనిట్‌ను కూడా స్థాపించాం. ఈ యూనిట్‌లో 200 మంది సిబ్బంది, హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది పాల్గొననున్నారు. వారు హై రిస్క్‌ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తారు'' అని వివరించారు.

    వివరాలు 

    అగ్నిమాపక సేవల కోసం రూ.67 కోట్లు

    గత కుంభమేళాలో అగ్నిమాపక సేవల కోసం రూ.6 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని పెంచి రూ.67 కోట్లుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం  వైజాగ్
    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ  చంద్రబాబు నాయుడు
    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత

    ఉత్తర్‌ప్రదేశ్

    UP: బరేలీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్..? దిల్లీ
    Prayagraj: 5 మందిపై 'దెయ్యం' ఎఫ్ఐఆర్ దాఖలు: తర్వాత ఏం జరిగింది  భారతదేశం
    UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్ ఇండియా
    Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025