LOADING...
Uttar Pradesh: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన హై-మాస్ట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి
రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన హై-మాస్ట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి

Uttar Pradesh: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన హై-మాస్ట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్‌బోర్డ్ స్తంభం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈఘటనలో కారును నడుపుతున్న సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కొత్తగా హై-మాస్ట్ బిల్‌బోర్డ్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. అదే సమయంలో ఆ రహదారిపై ఒక కారు వెళ్తుండగా,నిర్మాణంలో ఉన్న హై-మాస్ట్ పోల్ ఒక్కసారిగా కూలి కదులుతున్న కారుపై పడింది.

వివరాలు 

సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియో క్లిప్‌లు

ఈ ప్రమాదంలో 48 ఏళ్ల సమాజ్‌వాదీ పార్టీ నేత లాల్‌ బహదూర్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. పోల్‌ బలంగా పడటంతో కారులోనే ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ప్రమాద దృశ్యాలు 

Advertisement