NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు
    ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

    ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Stalin
    Jul 11, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మూడవసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అయితే, జులై చివరి వరకు పదవిలో కొనసాగడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.

    దర్యాప్తు సంస్థకు కేంద్రం కొత్త చీఫ్‌ని నియమించాలని స్పష్టం చేసింది.

    ఎస్‌కే మిశ్రా పదవీ కాలం పొడిగించడం అనేది 2021లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

    సంజయ్ కుమార్ మిశ్రా 1984వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. నవంబర్ 2023లో పదవీ విరమణ చేయనున్నారు.

    ఈడీ

    2018 నవంబర్‌లో ఈడీ చీఫ్‌గా మిశ్రా నియామకం

    నవంబర్ 2018లో మిశ్రా తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా రెండేళ్ల కాలవ్యవధికి నియమితులయ్యారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది.

    నవంబర్ 13, 2020న, 'రెండేళ్ల' కాలాన్ని 'మూడేళ్ల' కాలానికి మార్చే విధంగా రాష్ట్రపతి 2018లో జారీ చేసిన ఉత్తర్వును సవరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది.

    దీనిని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2021, సెప్టెంబరలో ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రం సవరణను ఆమోదించింది.

    అయితే మూడోసారి మిశ్రాకు పదవీకాలాన్ని పొడగించాడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    సుప్రీంకోర్టు

    Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?  డెన్మార్క్
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్
    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  వైఎస్సార్ కడప
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు రెజ్లింగ్

    తాజా వార్తలు

    వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు  సుప్రీంకోర్టు
    నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు  పశ్చిమ బెంగాల్
    PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025