NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌
    తదుపరి వార్తా కథనం
    Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌
    ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌

    Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    09:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది.

    పండుగ రద్దీ నేపథ్యంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.

    కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైలు సేవలను అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

    ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి.

    ఈ రైళ్ల కోసం టికెట్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌ జనవరి 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.

    వివరాలు 

    కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653): 

    ఈ రైలు జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

    తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్‌ - కాచిగూడ రైలు (07654) జనవరి 10, 12 తేదీల్లో సాయంత్రం 5:10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

    వివరాలు 

    హైదరాబాద్‌ - కాకినాడ టౌన్‌ రైలు (07023): 

    ఈ రైలు జనవరి 10న సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

    తిరుగు ప్రయాణంలో (07024) జనవరి 11న రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

    ఈ రైళ్లు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్
    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025