NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
    నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం

    Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

    ఈ పవిత్ర ఉత్సవాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు.

    పుష్కరిణి వద్ద రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి.

    భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ ప్రాంతంలో మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.

    రోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని అంచనా.

    భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు.

    అదనంగా, సాంస్కృతిక, కళాపరమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    పుష్కరాల కోసం రూ.35 కోట్ల బడ్జెట్‌

    భక్తుల వసతికి తాత్కాలికంగా టెంట్ సిటీని ఏర్పాటు చేయగా, దీని ద్వారా వారు రుసుము చెల్లించి బస చేయవచ్చు.

    ఈ పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ,ఘాట్ల నిర్మాణం,రహదారుల మరమ్మతులు,పార్కింగ్ సదుపాయాలు వంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

    రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

    వివరాలు 

    86 గదుల వసతి సముదాయాన్నిప్రారంభించనున్న రేవంత్ 

    ఈ గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సతీమణితో కలిసి కాళేశ్వరం చేరుకోనున్నారు.

    వారు పుష్కర స్నానాన్ని ఆచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు.

    అనంతరం సరస్వతి నదికి నిర్వహించే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

    భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల వసతి సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు. కాళేశ్వరం పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం‌గా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం తెలంగాణ
    Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన వరంగల్ తూర్పు
    Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన పసిడి ధరలు  బంగారం
    TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు ఐక్యరాజ్య సమితి

    తెలంగాణ

    Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ కాంగ్రెస్
    Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య రంగారెడ్డి
    Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే ప్రభుత్వం
    mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025