Page Loader
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Oct 03, 2023
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉపశమనం కల్పించలేదు. చంద్రబాబు జైలుశిక్షను మరో ఆరు రోజులు పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ముందు సమర్పించిన అన్ని మెటీరియల్‌లను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరో ఆరు రోజులు జైలులోనే చంద్రబాబు..