NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 
    Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక

    Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 

    వ్రాసిన వారు Stalin
    Nov 21, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి(Patanjali)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది.

    ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్‌ ప్రచురిస్తున్న పతంజలి(Patanjali) సంస్థను జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మందలించింది.

    ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి యాడ్స్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.

    ఈ సందర్భంగా పతంజలి గ్రూప్‌ను హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు పతంజలి ఆయుర్వేదం తక్షణమే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

    కోర్టు

    ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల జరిమానా విధిస్తాం: ధర్మాసనం

    తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అవసరమైతే జరిమానాను కూడా విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

    ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల జరిమానా కూడా విధిస్తామని జస్టిస్ అమానుల్లా వివరించారు. పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ నుంచి భవిష్యత్‌లో తప్పుడు ప్రకటనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం చర్చకు పతంజలి సంస్థ కారణం కాకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది.

    ఈ సమస్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కోర్టు చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంటుందని భారత అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్‌కు ధర్మాసనం సూచించింది.

    ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన సిఫార్సులు సమర్పించాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    సుప్రీంకోర్టు

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు  చంద్రబాబు నాయుడు
    ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మద్యం పాలసీ కేసులో ఆప్‌ పార్టీ పేరు  దిల్లీ లిక్కర్ స్కామ్‌
    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ వాయిదావేసిన సుప్రీంకోర్టు   మనీష్ సిసోడియా

    తాజా వార్తలు

    India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో ప్రపంచ కప్
    Venkitaramanan: ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ కన్నుమూత  ఆర్ బి ఐ
    World Cup final: టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్ల గణాంకాలు ఇవే.. ప్రపంచ కప్
    Khalistani threat: భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు 'ఖలిస్థానీ' గ్రూప్ బెదిరింపులు ఖలిస్థానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025