
Jammu and Kashmir: షోపియాన్లో ఎన్కౌంటర్; ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
మంగళవారం తెల్లవారుజామున షోపియాన్లోని అల్షిపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను మోరిఫత్ మక్బూల్,జాజిమ్ ఫరూఖ్, అలియాస్ అబ్రార్ లష్కరే తోయిబా (LeT) గా గుర్తించారు.
కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో ఉగ్రవాదుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు.భద్రతా సిబ్బంది తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఫిబ్రవరిలో దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
స్థానిక మార్కెట్కు వెళ్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. తదుపరి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిబ్రవరిలో సంజయ్ శర్మను కాల్చిచంపిన ఉగ్రవాదులు
#ShopianEncounterUpdate: Killed #terrorists have been identified as Morifat Maqbool & Jazim Farooq @ Abrar of #terror outfit LeT. #Terrorist Abrar was involved in killing of Kashmiri Pandit late Sanjay Sharma: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/Jj0Bxb49dG
— Kashmir Zone Police (@KashmirPolice) October 10, 2023