Amonium Nitrate: రాజస్థాన్లో 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్.. ఇద్దరు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్లో భారీ మొత్తంలో పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో అనుమానాస్పదంగా కదులుతున్న ఓ కారును అధికారులు పట్టుకున్నారు. ఆ మారుతీ కారులో సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్ను తరలిస్తున్నట్లు గుర్తించారు. యూరియా బస్తీల్లో దాచిపెట్టి ఈ పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తున్నట్టు సమాచారం. అదే సమయంలో, ఈ వాహనం నుంచి సుమారు 200 ఎక్స్ప్లోసివ్ బ్యాటరీలు, దాదాపు 1100 మీటర్ల పొడవైన వైరు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరిని సురేంద్రగా, మరో వ్యక్తిని సురేంద్ర మోచీగా గుర్తించారు. ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్
Tonk, Rajasthan: DSP Mrityunjay Mishra says, "Explosives were seized from a Maruti Ciaz car. 150 kg of ammonium nitrate hidden in sacks of urea seized. In addition, police recovered 200 explosive batteries and 1100 meters of wire. Two accused have been arrested. One is Surendra… pic.twitter.com/XihaaoLvsx
— Daily Excelsior (@DailyExcelsior1) December 31, 2025